భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ @ అసెంబ్లీ మీడియా పాయింట్
..రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమాగం అయిండు.
ముఖ్యమంత్రి అడ్డగోలుగా అన్ని అబద్ధాలు మాట్లాడారు.
ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేయడం నాకు చేతకాదని చెప్పారు.
అసెంబ్లీ సాక్షిగా ఒక కన్ఫ్యూషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఎన్నికలప్పుడు అనుకోకుండా హామీలు ఇచ్చామని చెప్తున్నారు.
కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాకు పరిపాలన నడపడం రావట్లేదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పాడు.
రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లు ఎలా అయిందో రేవంత్ రెడ్డి చెప్పలేకపోయాడు.
సిగ్గు లేకుండా 100% రుణమాఫీ అయిందని చెప్తున్నాడు.
రుణమాఫీపై మేం అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.
అసెంబ్లీలో అబద్ధాలు చెప్పే శిక్షణ ఎమ్మెల్యేలకు సరిగా ఇచ్చినట్టు లేరు.
అందుకే ఒక ఆయన 70% అయిందని చెప్తుంటే..
ముఖ్యమంత్రి మాత్రం 100 శాతం రుణమాఫీ చేశామని చెప్తున్నారు.
రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా సంపూర్ణంగా రుణమాఫీ జరగలేదు.
ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లెకి పోయినా ఈ విషయం తెలుస్తుంది.
రైతుబంధు, రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని డాంభికాలు చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాడు.
మళ్లీ బ్యాంకులకు వెళ్లి రెండు లక్షల రుణాలు తెచ్చుకొమ్మని అన్నాడు.
నేను రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాటిచ్చాడు.
మాయమాటలతో రైతులను మోసం చేశారు.
కేవలం 25% రుణమాఫీ చేసి.. 100% రుణమాఫీ అయినట్టు అసెంబ్లీలో ప్రకటన చేశారు.
దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నారు.
సీఎం రేవంత్ ఇవాళ అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడారు.
రైతుబంధులో రూ.22 వేల కోట్లు పక్కకు పోయాయని అబద్ధాలు చెబుతున్నారు.
రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చామో వివరాలు ఇవ్వాలని అడిగితే.. ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.
ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు.
ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి చెప్పే ప్రతీ మాట నమ్మాల్సిన అవసరం లేదు.
వర్షా భావ పంటలైన కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్రచేస్తున్నారు.
45 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్న రైతులకు రెండో పంటకు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు.
తెలంగాణ రైతు ఆత్మహత్యలపై కూడా అబద్ధాలు చెప్పే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు ఉంటే... రైతుబంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 రైతు ఆత్మహత్యలు మాత్రమే జరిగాయి.
కేవలం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పది సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఆత్మహత్యలు తగ్గాయి.
రాష్ట్రం ఏర్పడకముందు 11 శాతం ఆత్మహత్యలతో తెలంగాణ దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉండేది. తెలంగాణ వచ్చాక 2023 నాటికి రైతు ఆత్మహత్యలను 1.57 శాతానికి తగ్గించాం.
రేవంత్ రెడ్డికి చరిత్ర, వర్తమానం తెలియదు. లెక్కలు అసలే తెలియవు.
తెలంగాణ 1956లోనే సర్ ప్లస్ స్టేట్.
1968లో కూడా మనది సర్ ప్లస్ స్టేట్.
2001లో కూడా తెలంగాణ సర్ ప్లస్ స్టేట్.
2014లో తెలంగాణ వచ్చిన నాడు కూడా సర్ ప్లస్ స్టేట్.
కొత్తగా కాంగ్రెస్ ఉద్ధరించింది ఏమీ లేదు.
రుణమాఫీకి ఇచ్చింది కేవలం రూ.12 వేలు కోట్లే
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేసింది.
రైతుబంధు ద్వారా రూ.73 వేల కోట్లు ఇచ్చాం.
నేరుగా రైతుల ఖాతాల్లో పదేళ్లలో రూ.లక్ష కోట్లు జమ చేసినం.
రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలిచింది
ఒడిశా, బెంగాల్ లాంటి రాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాలు తెచ్చాయి.
ఉద్యోగస్తులకు రైతుబంధు ఇవ్వమని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు?
రైతుబంధుకు పాన్ కార్డు ఆప్షన్ పెడితే కోటీ 30 లక్షల మంది నష్టపోతారు
ఐటీ కట్టే వాళ్లందరికీ రైతుబంధు కట్ చేస్తే ఇక మిగిలేదెవరు?
ఎన్నికలకు ముందు అందరికీ అన్ని.. ఇప్పుడు కొందరికి కొన్ని!
సంక్రాంతి తర్వాత రైతుభరోసా అంటున్నారు. ఏ సంక్రాంతికో చెప్పడం లేదు.
పేర్లు మార్చడం కాదు.. ప్రజలు కోరుకున్నది గుణాత్మకమైన మార్పు.
పెంచిన రైతుభరోసా రైతులకు ఇవ్వాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపించాలి
రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు
ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు.
రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నీడలాగా వెంటాడుతూనే ఉంటాం.
0 Comments