సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
🔹 డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈఓలపై వేధింపులు తగవు.
🔹 డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను సస్పెండ్ చేయడం దారుణం.
🔹 కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పక్క రాష్ట్రాల్లో ఏజెన్సీలు, ఇతర శాఖల సహాయంతో కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా ఇది జరుగుతుంటే, ఇక్కడ మాత్రం ఏఈఓల నెత్తిన రుద్దడం ఎందుకు?
🔹 తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేందుకు ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించాలని, 1500 కొత్త ఏఈఓల పోస్టులను సృష్టించి, 2601 రైతు వేదికలను ఏర్పాటు చేశారు.
🔹 తెలంగాణలో వ్యవసాయ విస్తరణ, సాగు పెంపు, అధిక దిగుబడి సాధించి దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఏఈఓల పాత్ర ఎనలేనిది.
🔹 అప్పటికీ వారికి పనిభారం పెరుగుతుందని మళ్లీ సర్వే చేయించి, సుమారు 350 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వాటిని మంజూరు చేసి కొత్త వారిని నియమించాలి.
🔹 ఏఈఓల విజ్ఞప్తి మేరకు డిజిటల్ క్రాప్ సర్వేకు అవసరమైన సహాయకులను నియమించడం, లేదా ఏజెన్సీలకు పనిని అప్పగించడం చేయాలి.
🔹 డిజిటల్ క్రాప్ సర్వేకు విడుదలైన నిధులను ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు?
🔹 ఏఈఓలలో అత్యధికులు మహిళలు ఉన్నారు. క్రాప్ సర్వే పేరుతో వారిని నిర్మానుష్య వ్యవసాయ కమతాలకు ఎలాంటి రక్షణ లేకుండా ఎలా పంపిస్తున్నారు? వారి భద్రతకు బాధ్యత ఎవరిది?
🔹 వారు ఇప్పటికే 49 రకాల విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా వారి మీద పనిభారం ఎందుకు పెడుతున్నారు?
🔹 ఔట్సోర్సింగ్ మీద పనిచేస్తున్న వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసం?
🔹 ప్రజా పాలన అంటే బెదిరింపులేనా?
🔹ప్రజా పాలనలో ఉద్యోగులను కూడా కాంగ్రెస్ విభజించి పాలిస్తుంది.
🔹రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది.
0 Comments