కేన్స్ సంస్థ గుజరాత్ తరలిపోతుందన్నది వాస్తవం.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి గారు అసత్యాలు చెప్పారు.
మూడు యూనిట్లలో కీలమైన రెండు యూనిట్లు తరలిపోతున్నాయి.
కాంగ్రెస్ చేతగాని, అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడి దారుల్లో అయోమయం
ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్
తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థ కు చెందిన అత్యంత ఆధునాతనమైన (OSAT) యూనిట్గుజరాత్ కు తరలిపోతుందన్నది నిజమని కేటీఆర్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి నేను ట్వీట్ చేసిన తర్వాత గౌరవ మంత్రి గారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేన్స్ సంస్థ తెలంగాణలోనే ఉంటుందన్నట్లుగా ప్రకటన చేశారని మండిపడ్డారు. నిజానికి కేన్స్ సంస్థ తెలంగాణలో మూడు యూనిట్లను స్థాపించేలా ఒప్పించి వారికి అన్ని అనుమతులను ఇచ్చామని చెప్పారు. సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఒకటి కాగా అత్యంత ఆధునాతమైన (OSAT) కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయాల్సి ఉంది. మరొకటి PCB యూనిట్ ను వరంగల్ లో ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీని ఒప్పించామని చెప్పారు. వీటిలో కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయాల్సిన (OSAT) గుజరాత్ కు తరలిపోయిందని, ఇక వరంగల్ లో ఏర్పాటు చేయాల్సిన PCB యూనిట్ పై స్పష్టత లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం కేన్స్ సంస్థ సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను మాత్రమే కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయనుందన్నారు.
0 Comments