అనంతరం జరిగే యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా.. పూజారుల ఆహ్వానం..
• నాటి కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి.. ఈనెల 23 న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరి గుట్ట పునర్నిర్మాణ కర్త, బి ఆర్ ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారిని ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
అనంతరం...మార్చి నెల 1 నుంచి 11 వ తారీఖు వరకు జరిగే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ గారిని కోరారు.
ఈ మేరకు యాదగిరి గుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారులతో కూడిన బృందం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రాలతో కేసీఆర్ కు ఆశీర్వచనం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీ ఈ ఓ భాస్కర్, ముఖ్య అర్చకులు నరసింహ మూర్తి, కిరణ్ కుమారాచార్యులు, పి ఆర్ ఓ రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
0 Comments