ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

 
✱ ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

✱ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవటంపై కేటీఆర్ ఆవేదన

✱ ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచన

✱ మిగతా విద్యార్థుల తల్లితండ్రులకు గర్భశోకం మిగల్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి

✱ బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్లు ప్రకటన

ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ 👇👇

👉 అనిరుధ్ అనే చిన్నారి మరణం ఆ తల్లితండ్రులతో పాటు ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది

👉 ఇలాంటి సంఘటనలకు సంబంధించి రాజకీయాలు వద్దు. మన అందరికీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత బాధ ఉంటదో అర్థం చేసుకోగలం

👉 ఈ 8 నెలల కాలంలో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు

👉 కొందరు విషాహారం తిని, మరికొందరు పాముకాట్ల కారణంగా, ఇంకొందరు విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోవటం బాధాకారం

👉 చనిపోవటమే కాదు 500 వందల పిల్లలు విషాహారం తిని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది

👉 పిల్లలు బాగుండాలి, వారు ప్రపంచంతో పోటీపడే విధంగా చదువుకోవాలని మనం వెయ్యికి పైగా  గురుకులాలు పెట్టుకున్నాం

👉 వాటిని ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలుగా కూడా అప్‌గ్రేడ్ చేసుకున్నాం

👉 ప్రభుత్వం సంక్షేమ పాఠశాలు, సంక్షేమ వసతుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే తల్లితండ్రి మాదిరిగా బాధ్యత తీసుకోవాలి

👉 ఈ విషయంలో రాజకీయం వద్దు.. చనిపోయిన 36 మంది విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

👉 మిగతా తల్లులకు కూడా మళ్లీ ఇలాంటి గర్భశోకం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

👉 ప్రతి తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్ మీద ఎంతో ఆశపెట్టుకుంటారు. అలాంటి వారి పిల్లలు చనిపోతే మొత్తం వాళ్ల ఆశలే లేకుండా పోతాయి

👉 ఈ విషయంలో మేము రాజకీయం చేయాలనుకోవటం లేదు.. ప్రభుత్వం బేషజాలకు పోవద్దు

👉 గతంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన కమిటీ వేస్తున్నాం

👉 ఒక 20 పాఠశాలలను పరిశీలించిన చేపట్టాల్సిన చర్యలను ఆయన ఐదారు రోజుల్లో నివేదిక ఇస్తారు

👉ప్రభుత్వానికి సూచనలు చేసే మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాం.. దీన్ని రాజకీయంగా భావించవద్దు

👉పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరముంది

👉గతంలో మేము బాసరలో విద్యార్థులకు ఆహారం విషయంలో భరోసా ఇచ్చాం

👉కలెక్టర్లు, అధికారులు సంక్షేమ హాస్టల్స్ సర్‌ప్రైజ్ విజిట్ చేసి ఆహార నాణ్యత ఎలా ఉందో పరిశీలించాలి

👉ప్రతి పాఠశాల ఆవరణలను శుభ్రం చేయించండి

👉ఈ పిల్లలు మన పిల్లలు.. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న ఆరున్నర లక్షల మంది పిల్లలకు ప్రభుత్వమే తల్లితండ్రులు

👉ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని అర్థం చేసుకోని మంచి చేయాలని కోరుతున్నా.

Post a Comment

0 Comments