*పుస్తక ప్రదర్శన ప్రారంభించిన
రియాజ్ -తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్*
15 ఆగస్టు గురువారం:- గురువారం నాడు పంద్రాగస్టు సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యాలయంలో పుస్తక ప్రదర్శనను గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ బుక్ ట్రస్ట్ ప్రగతిశీల సాహిత్యానికి కేంద్ర బిందువు , తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమాలకు సంబంధించిన సాహిత్యాన్ని విస్తృతంగా తీసుకురావాల్సిన అవసరం మరింత ఏర్పడిందని అన్నారు. సాహిత్యం అనేది సమాజంలో భిన్న కుల మతాలను సమైక్యపరుస్తుందని అన్నారు. ఈ పుస్తక ప్రదర్శనలో సాహిత్యంలో వివిధ ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలతో పాటుగా పోటీ పరీక్షల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు ప్రదర్శన కు ఉంచటం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా రచయిత సామిడి జగన్ రచించిన భారతదేశ విప్లవ కవి గద్దర్ గ్రంధాన్ని డాక్టర్ రియాజ్ కు బహుకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రాజు , డిప్యూటీ డైరెక్టర్ హరిశంకర్ , సామాజిక కార్యకర్త జి రాములు, సీనియర్ జర్నలిస్ట్ కొండూరు వీరయ్య, కవి తంగిరాల చక్రవర్తి, సామిడి జగన్ రెడ్డి, నరసింహ, గురుమూర్తి, జిల్లా నరేష్, అలకనంద, వాగ్దేవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments